5వందల రోజులకు చేరిన Vishakha steel పరిరక్షణ ఉద్యమానికి జేజేలు: Ramakrishna
ABN , First Publish Date - 2022-06-26T19:09:34+05:30 IST
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమం 5వందల రోజులకు చేరింది.
విజయవాడ (Vijayawada): ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ (Privataization)కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమం ఆదివారం నాటికి 500 రోజులకు చేరుకుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) అన్నారు. 500 రోజులకు చేరిన విశాఖ ఉక్కు (Vishakha steel) పరిరక్షణ ఉద్యమానికి జేజేలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా నరేంద్రమోదీ (Modi) ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును కాపాడేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ప్రధాని మోదీని కలిసి ఒత్తిడి పెంచాలన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి సంఘీభావంగా ఆదివారం విజయవాడ, దాసరి భవన్ నుంచి సిపిఐ సంఘీభావ ర్యాలీ చేపట్టిందని రామకృష్ణ తెలిపారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. అమ్మేవాడెవడురా.. కొనేవాడెవడురా’ అంటూ నినాదాలు చేశారు.