మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-06-15T14:47:44+05:30 IST

అమరావతి: మే నెలలో ఏపీలో సంభవించిన మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: రామకృష్ణ

అమరావతి: మే నెలలో ఏపీలో సంభవించిన మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఒక్క మే నెలలోనే 1.30 లక్షల మరణాలు సంభవించగా, అందులో కేవలం 3 వేల మంది మాత్రమే కరోనాతో మరణించారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. ప్రతి ఏడాది మే నెలలో జరిగే సాధారణ మరణాల కంటే 400 శాతం అధికంగా ఈ ఏడాది జరగటం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మరణాలపై కాకి లెక్కలు చెబుతోందన్నారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రు.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.


Updated Date - 2021-06-15T14:47:44+05:30 IST