పర్యాటక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి: సీపీఐ రామకృష్ణ
ABN , First Publish Date - 2020-10-18T09:06:18+05:30 IST
పర్యాటక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి: సీపీఐ రామకృష్ణ
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఏపీటీడీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎంకు లేఖ రాసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.