సీసీ టీవీ ఫుటేజీని బహిర్గతం చేయాలి: జడ్జి రామకృష్ణ

ABN , First Publish Date - 2020-09-29T19:46:06+05:30 IST

సీసీ టీవీ ఫుటేజీని బహిర్గతం చేయాలి: జడ్జి రామకృష్ణ

సీసీ టీవీ ఫుటేజీని బహిర్గతం చేయాలి: జడ్జి రామకృష్ణ

విజయవాడ: తన తమ్ముడిపై జరిగిన దాడి కేసులో పోలీసులు పడుతున్న తాపత్రయం చూస్తే జాలేస్తోందని జడ్జి రామకృష్ణ అన్నారు. పోలీసులు చేసిన ప్రమాణాలను కూడా.. మంత్రి కోసం మరచిపోయారన్నారు. సెంథిల్ కుమార్ చెబుతున్న విషయాలకు, వాస్తవాలకు పొంతన లేదని చెప్పారు. దాడి జరిగిన రోజు అక్కడే ఉన్న ఎస్పీ అప్పుడే ఎందుకు స్పందించలేదు? అని ఆయన ప్రశ్నించారు. ‘‘రాడ్లతో కొట్టినట్లు సీసీ ఫుటేజీలో కనపించడంలేదని ఎస్పీ అంటున్నారు. సీసీ టీవీ ఫుటేజీని బహిర్గతం చేయాలి. తన తమ్ముడు పైకి లేవలేని స్థితిలో పడి ఉంటే..చిన్న గాయాలుగా ఎస్పీ చెప్పడం ఆయన వృత్తికే అవమానం. దాడి చేసినవారు ఏ పార్టీ వారైనా.. అరెస్టు చేసి శిక్షించాలి’’ అని జడ్జి రామకృష్ణ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-09-29T19:46:06+05:30 IST