జార్ఘండ్ సీఎం ట్వీట్లో తప్పేముంది?
ABN , First Publish Date - 2021-05-09T09:11:34+05:30 IST
‘ప్రధాని నరేంద్ర మోదీపై జార్ఘండ్ సీఎం చేసిన ట్వీట్లో తప్పేముంది. జగన్మోహన్రెడ్డి తన స్వప్రయోజనాల కోసం మోదీకి మోకరిల్లుతున్నారు’’
చంద్రబాబుపై కేసులు అక్రమం: రామకృష్ణ
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రధాని నరేంద్ర మోదీపై జార్ఘండ్ సీఎం చేసిన ట్వీట్లో తప్పేముంది. జగన్మోహన్రెడ్డి తన స్వప్రయోజనాల కోసం మోదీకి మోకరిల్లుతున్నారు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం అక్రమమని రామకృష్ణ అన్నారు. జగన్ చేసేది కరోనాపై యుద్ధమా? లేక తనని కాదన్న వాళ్లపై కక్ష సాధింపా? అని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.