జిల్లాలోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు : కలెక్టర్
ABN , First Publish Date - 2020-05-25T10:29:14+05:30 IST
జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్ హరికిరణ్ శుభా కాంక్షలు ప్రకటించారు. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లాలోని ముస్లింలు..
కడప(కలెక్టరేట్), మే 24: జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్ హరికిరణ్ శుభా కాంక్షలు ప్రకటించారు. రంజాన్ పండుగ సందర్భంగా జిల్లాలోని ముస్లింలు ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని సూచించారు. పవిత్ర రంజాన్ మా సంలో ధైవారాధన, దాన ధర్మాలు చేయడం,చెడును త్యజించడం, విశ్వమానవాళికి సేవ చేయడం తదితర బోధనలు ఖురాన్లో స్పష్టంగా ఉన్నాయని ఆయన వివరించారు. వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడం, లాక్డౌన్ విపత్క ర పరిస్థితులు, నిబంధనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ముస్లింలంతా పాటిస్తూ రంజాన్ పండుగను కొనియాడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకుని జిల్లా యంత్రాంగానికి సహకరించారన్నారు. ప్రతి ముస్లిం పండుగను సంతోషంగా ఆనందంగా చేసుకోవాలని కలెక్టర్ ప్రకటనలో ఆకాంక్షించారు.