ఈదుల్ ఫీతర్కు భారీ బందోబస్తు
ABN , First Publish Date - 2022-05-02T22:20:07+05:30 IST
రంజాన్ సందర్భంగా నగరంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 3న ఈదుల్ ఫీతర్ ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి నున్న మీరాలం
హైదరాబాద్: రంజాన్ సందర్భంగా నగరంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 3న ఈదుల్ ఫీతర్ ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి నున్న మీరాలం ఈద్గా, మక్కా మసీదు, పాత బస్తీలోని చౌక్ మసీదు, అఫ్జల్గంజ్ జామా మసీదు, వజర్ ఆలీ మసీదు, సిద్ది అంబర్ బజార్ మసీదులతో పాటు మాసాబ్ ట్యాంక్లోని హాకీ స్టేడియానికి భారీ సంఖ్యలో ముస్లింలు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ఏర్పాటు చేశారు. సెవెన్ టూంబ్స్, లంగర్ హౌజ్, సికింద్రాబాద్, మాధన్నపేట్, కొత్తపేట్, కులీకుతుబ్షా స్టేడియం, ఎన్టీఆర్ స్టేడియంతో పాటు వివిధ ఈద్గాలు, మైదానాల్లో ప్రత్యేక నమాజ్లు సాగుతాయి. ఈ నేపథ్యంలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.