భక్తిశ్రద్ధలతో రంజాన్‌ వేడుకలు

ABN , First Publish Date - 2020-05-26T10:15:35+05:30 IST

జిల్లావ్యాప్తంగా ముస్లింలు సోమవారం రంజాన్‌ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో..

భక్తిశ్రద్ధలతో రంజాన్‌ వేడుకలు

ఇళ్లల్లోనే ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు


అనంతపురం టౌన్‌, మే 25: జిల్లావ్యాప్తంగా ముస్లింలు సోమవారం రంజాన్‌ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో మసీదుల్లో పరిమిత సంఖ్యలో కేవలం మతగురువులు మాత్రమే ఈద్‌ఉల్‌ ఫితర్‌ నమాజ్‌ ప్రార్థనలు చేశారు. ముస్లింలంతా ఇళ్లల్లోనే కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలుప్రాంతాల్లో మసీదుల్లోని మైకుల ద్వారా మౌలానాలు రంజాన్‌ విశిష్టతను బోధించారు. లాక్‌డౌన్‌ కారణంగా పండుగ వాతావరణం కనిపించలేదు. ఈద్గా మైదానాలు బోసిపోగా, పలుచోట్ల సందడి అంతంతమాత్రమే.


Updated Date - 2020-05-26T10:15:35+05:30 IST