‘రామాలయ అభివృద్ధికి కృషి చేస్తాం’

ABN , First Publish Date - 2020-12-06T04:49:08+05:30 IST

రామయ్య అభివృద్ధికి కృషి చేస్తామని మిషన్‌ న్యూ ఇండియా అధ్యక్షుడు రవిచాణక్య అన్నారు.

‘రామాలయ అభివృద్ధికి కృషి చేస్తాం’
కోదండరామాలయం దర్శించుకున్న మిషన్‌ ఇండియా అధ్యక్షుడు రవిచాణక్య

ఒంటిమిట్ట, డిసెంబరు5 : రామయ్య అభివృద్ధికి కృషి చేస్తామని మిషన్‌ న్యూ ఇండియా అధ్యక్షుడు రవిచాణక్య అన్నారు. శనివారం కోదండరామాలయాన్ని సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు, అర్చకులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం రంగమండపంలో ఆలయ విశిష్టత తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ అభివృద్ధి పనులకు ఆర్కియాలజికల్‌ పర్మిషన్‌ అవసరమని తెలిసిందని ఆలయ అభివృద్ధి విషయమై ప్రధానమంత్రిని కలిసి వివరించడం జరుగుతుందన్నారు. కేంద్ర, ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధికి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌ఇండియా అధ్యక్షుడు నటే్‌షకుమార్‌, మహిళా అధ్యక్షురాలు మమతాదేవి, పాండిచ్చేరి అధ్యక్షుడు యువరాజు, రాయలసీమ ఇన్‌చార్జి విద్వాన్‌ శివశంకర్‌, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:49:08+05:30 IST