రామ మందిరానికి రూ.5 లక్షలు
ABN , First Publish Date - 2021-01-26T06:00:58+05:30 IST
విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వాసవి మహిళా కళాశాల అధినేత సోమిశెట్టి వెంకట్రామయ్య అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు.
కర్నూలు (కల్చరల్), జనవరి 25: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వాసవి మహిళా కళాశాల అధినేత సోమిశెట్టి వెంకట్రామయ్య అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. తన కార్యాలయంలో వీహెచ్పీ కేంద్రీయ సంయుక్త కార్యదర్శి రాఘవులుకు సోమవారం ఆయన చెక్కును అందించారు. మందిర నిర్మాణానికి తన వంతు సహకారం ఇచ్చానని ఆయన తెలిపారు. ఈ నెల 31 వరకు విరాళాల సేకరణ ఉంటుందని రాఘవులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాళిగి వ్యాసరాజ్, రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రాముడు, నగర అధ్యక్షుడు లక్కిరెడ్డి అమరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.