కోలుకుంటున్న రామాలయం ట్రస్ట్ చీఫ్ నృత్యగోపాల్ దాస్

ABN , First Publish Date - 2022-04-26T12:31:36+05:30 IST

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్(83) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని...

కోలుకుంటున్న రామాలయం ట్రస్ట్ చీఫ్ నృత్యగోపాల్ దాస్

లక్నో (ఉత్తరప్రదేశ్) : శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్(83) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.లక్నోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన నృత్య గోపాల్ దాస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా, సంతృప్తికరంగా ఉందని వైద్యులు తెలిపారు.దాస్ గత కొంతకాలంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నారు. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్,బలహీనత కారణంగా దాస్ ను అయోధ్య నుంచి లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం గోపాల్ దాస్ క్రిటికల్ కేర్, యూరాలజీ బృందం పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా, సంతృప్తికరంగా ఉందని మేదాంత మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కపూర్ తెలిపారు. 


గోపాల్ దాస్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బాధ్యత వహిస్తోంది. ఒకవైపు అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా ట్రస్ట్ చీఫ్ దాస్ అస్వస్థతకు గురవడం పట్ల ట్రస్టు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.


Updated Date - 2022-04-26T12:31:36+05:30 IST