బాల్ థాకరే కల నెరవేరింది : శివసేన
ABN , First Publish Date - 2020-08-05T20:56:30+05:30 IST
రామ మందిర భూమి పూజతో శివసేన వ్యవస్థాపకులు బాల్థాకరే కన్న కలలు నెరవేరాయని శివసేన పేర్కొంది.
ముంబై : రామ మందిర భూమి పూజతో శివసేన వ్యవస్థాపకులు బాల్థాకరే కన్న కలలు నెరవేరాయని శివసేన పేర్కొంది. ఈ వేడుక అందరికీ ఆనందకరమైందని, రాముడు భారతీయుల ఆరాధ్య దైవమని తెలిపింది. ‘‘బాలా సాహేబ్ థాకరే కన్న కలలు నిజమయ్యాయి.’’ అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.