శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-04-21T16:25:31+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతున్న

శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతున్న నేపధ్యంలో ఈరోజు శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తదితర ప్రముఖులు దేశ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో... శ్రీరామ నవమి శుభసంద్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆదర్శ పురుషుడైన శ్రీరాముని జన్మదినం సందర్భంగా  జరుపుకునే ఈ వేడుక.. మనకు ఆదర్శప్రాయమైన జీవితం గడిపేందుకు ప్రేరణనిస్తుంది. మనమంతా కోవిడ్-19 మహమ్మారిని నియబద్ధ జీవనంతో తరిమి కొడదాం’ అని పేర్కొన్నారు. 


ప్రధాని నరేంద్ర మోదీ తన ట్వీట్‌లో... ‘ఈ రోజు శ్రీరామ నవమి. ఆదర్శప్రాయమైన జీవితం గడపాలని శ్రీరాముడు మనకు సందేశమిస్తున్నాడు. ఈ కరోనా కాలంలో వైరస్ నుంచి తప్పించుకునేందుకు ఉన్న మార్గాలన్నింటినీ పాటించండి. అని పిలుపునిచ్చారు.  ఇదేవిధంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-04-21T16:25:31+05:30 IST