అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ప్రారంభించడంపై పాక్ అభ్యంతరాన్ని తోసిపుచ్చిన భారత్

ABN , First Publish Date - 2020-05-29T23:07:56+05:30 IST

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభించడంపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార బీజేపీ హిందుత్వ ఎజెండాలో భాగంగానే మందిర నిర్మాణ

అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ప్రారంభించడంపై పాక్ అభ్యంతరాన్ని తోసిపుచ్చిన భారత్

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభించడంపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార బీజేపీ హిందుత్వ ఎజెండాలో భాగంగానే మందిర నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని పాకిస్థాన్ ఆరోపించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా పాక్ తప్పుబట్టింది.


పాక్ తీరుపై భారత్ మండిపడింది. అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడే హక్కు పాకిస్థాన్‌కు లేదని కుండబద్దలు కొట్టింది. తనకు సంబంధం లేని విషయంపై పాక్ మాట్లాడటం శోచనీయమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. భారత్‌లో రాజ్యాంగం అన్ని ధర్మాలకూ సమ ప్రాధాన్యమిస్తుందని వెల్లడించారు. పాకిస్థాన్ విదేశాంగ శాఖకు అంత సమయముంటే సొంత రాజ్యాంగాన్ని చదివి తేడా తెలుసుకోవచ్చని అనురాగ్ చురకలంటించారు. పాక్‌లో మైనార్టీలు ఎదుర్కొంటోన్న ఇక్కట్లను కూడా అనుగాగ్ ప్రస్తావించారు. 

Updated Date - 2020-05-29T23:07:56+05:30 IST