జెండా వందనం

ABN , First Publish Date - 2022-08-12T05:23:46+05:30 IST

ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లాలో పలుచోట్ల జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.

జెండా వందనం
తాడేపల్లిగూడెం మండలం కొత్తూరులో ఉపాధి పనుల వద్ద ర్యాలీ

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లాలో పలుచోట్ల జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. పలు గ్రామాల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయ పతాకం చేతబట్టి చేపట్టిన ర్యాలీ ఆకట్టుంది. స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు అలరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు సైతం ర్యాలీలు నిర్వహించి నినాదాలు చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల యజమాన్యాలు, సిబ్బంది, కార్మికులు త్రివర్ణ పతాకాలతో పట్టణాలు, గ్రామాల్లో ప్రదర్శనగా సాగారు. పలుచోట్ల జాతీయ పతాకాలు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు స్వాతంత్ర్యోద్యమ చరిత్రను విద్యార్థులకు వివరించారు. అమర వీరుల త్యాగాలను వివరిస్తూ వారి ఆశయ బాటలోముందుకు సాగాలని పిలుపునిచ్చారు.







Updated Date - 2022-08-12T05:23:46+05:30 IST