స్వాతంత్య్ర సమర యోధులను స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-10T05:20:42+05:30 IST

స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను సర్మించుకోవాలని ఆర్డీవో దాసి రాజు అన్నారు.

స్వాతంత్య్ర సమర యోధులను స్మరించుకోవాలి
భీమవరంలో డీఎన్‌ఆర్‌ వాకర్స్‌ ర్యాలీ

భీమవరం టౌన్‌, ఆగస్టు 9: స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను సర్మించుకోవాలని ఆర్డీవో దాసి రాజు అన్నారు. డీఎన్‌ఆర్‌ వాకర్స్‌ అసోసియేషన్‌, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియ జేయాలన్నారు. శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్‌ చెరకువాడ రంగసాయి మాట్లాడుతూ 300మందికి జాతీయ జెండాలు పంపిణీ చేశామన్నారు.నరహరికృష్ణ, బోసురాజు, భీమాల శ్రీరామూర్తి, బొండా రాంబాబు, కారుమూరి సత్యనారా యణమూర్తి, డికెవి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:20:42+05:30 IST