3 వేల అడుగుల జెండాతో ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-13T07:08:37+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం మూడువేల అడుగుల జాతీయ జెండాతో చిత్తూరులో ర్యాలీ నిర్వహించారు.

3 వేల అడుగుల జెండాతో ర్యాలీ
భారీ జాతీయ జెండాతో ర్యాలీ

చిత్తూరు, ఆగస్టు 12: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం మూడువేల అడుగుల జాతీయ జెండాతో చిత్తూరులో ర్యాలీ నిర్వహించారు. నీతి అయోగ్‌, స్వామి వివేకానంద ఫౌండేషన్‌, నేచర్‌ లవర్స్‌, స్మార్ట్‌సిటీ డెవల్‌పమెంట్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ  ర్యాలీని ఎస్పీ రిషాంత్‌రెడ్డి ప్రారంభించారు. గాంధీ విగ్రహం నుంచి చర్చివీధి, బజారువీధి మీదుగా సారి కట్టమంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ సాగింది. వెయ్యి మంది విద్యార్థులు మూడు వేల అడుగుల జాతీయ జెండాను చేతబూని భారత్‌ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ట్రాఫిక్‌ డీఎస్పీ తిప్పేస్వామి, ఒకటో పట్టణ సీఐ నరసింహరాజు, అధికారులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T07:08:37+05:30 IST