కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ ర్యాలీ

ABN , First Publish Date - 2022-01-29T05:19:52+05:30 IST

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కమిషన్‌ చైర్మన్‌ మళ్ల విజయప్రసాద్‌ అన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ ర్యాలీ
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంఘీభావంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మళ్ల విజయప్రసాద్‌, బెహరా

గోపాలపట్నం, జనవరి 28: అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కమిషన్‌ చైర్మన్‌ మళ్ల విజయప్రసాద్‌ అన్నారు. జీవీఎంసీ కో ఆప్షన్‌ మెంబర్‌ బెహరా భాస్కరరావు అధ్యక్షతన స్థానిక కుమారి కల్యాణ మండపంలో శుక్రవారం 89, 90, 91, 92 వార్డుల విస్తృత స్థాయి కార్యకర్తలు, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మళ్ల విజయప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చడానికి వలంటీర్లు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయానికి సంఘీభావంగా కుమారి కల్యాణ మండపం నుంచి బంక్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ బీఎస్‌ కృష్ణ, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T05:19:52+05:30 IST