తణుకులో రాధాకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ
ABN , First Publish Date - 2022-04-27T16:36:13+05:30 IST
రాష్ట్రంలో మహిళలపై హత్య, అత్యాచారాలకు నిరసనగా తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు.
ప.గో: రాష్ట్రంలో మహిళలపై హత్య, అత్యాచారాలకు నిరసనగా తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఆడబిడ్డలకు రక్షణ కావాలని, జగన్ పోవాలంటూ అంటూ నినాదాలు చేశారు. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. నరేంద్ర సెంటర్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు.