విజయవాడలో రాజధాని అమరావతికి మద్దతుగా భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2020-02-25T22:08:34+05:30 IST

విజయవాడలో రాజధాని అమరావతికి మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీ, సీపీఐ, జనసేన, కాంగ్రెస్‌, జేఏసీ నేతలు పాల్గొన్నారు. మహిళలు

విజయవాడలో రాజధాని అమరావతికి మద్దతుగా భారీ ర్యాలీ

అమరావతి: విజయవాడలో రాజధాని అమరావతికి మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీ, సీపీఐ, జనసేన, కాంగ్రెస్‌, జేఏసీ నేతలు పాల్గొన్నారు. మహిళలు, రైతులు భారీగా ర్యాలీకి తరలివచ్చారు. దీంతో ఏలూరు రోడ్డు  కిక్కిరిసిపోయింది. జై అమరావతి నినాదాలతో విజయవాడ మార్మోగింది. చల్లపల్లి బంగ్లా నుంచి అప్సర సెంటర్‌, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు మీదుగా ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని.. మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. 

Updated Date - 2020-02-25T22:08:34+05:30 IST