రైతుల ఉద్యమానికి మద్దతుగా క్యాండిల్‌ ర్యాలీ

ABN , First Publish Date - 2020-12-06T04:57:50+05:30 IST

ఢిల్లీలో చేపట్టిన రైతుల ఉద్యమానికి సంఘీభావంగా సీపీఎం ఆధ్వర్యంలో శనివారం బద్వేలులో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు.

రైతుల ఉద్యమానికి మద్దతుగా క్యాండిల్‌ ర్యాలీ
క్యాండిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

బద్వేలు,డిసెంబరు5: ఢిల్లీలో చేపట్టిన రైతుల ఉద్యమానికి సంఘీభావంగా సీపీఎం ఆధ్వర్యంలో శనివారం బద్వేలులో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కార్పొరేట్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వానిక తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జీఎస్టీ పేరుతో భారీ పారిశ్రమిక నేతలకు పన్నులు తగ్గించారని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు నాగేంద్రబాబు, ప్రవీణ్‌కుమార్‌, ఖాదర్‌ హుసేన్‌, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T04:57:50+05:30 IST