తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు, రుణాల కోసం ధర్నా
ABN , First Publish Date - 2021-10-18T17:49:53+05:30 IST
తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని
హైదరాబాద్ సిటీ/రాంనగర్ : తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అర్హులందరికీ ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ కమిషన్కు చైర్మన్ను నియమించాలని కోరుతూ ఈ నెల 21న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా, నవంబర్ 2, 3న మండల స్థాయిలో ధర్నాలు చేస్తున్నామని కేవీపీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు జాన్వెస్లీ, టి.స్కైలాబ్ బాబు వెల్లడించారు. ఆదివారం కేవీపీఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో కేవీపీఎస్ ఉపాధ్యక్షుడు ఎం.కురుమయ్య నందిపాటి, నాయకులు మనోహర్, నాగార్జున, మాణిక్యం, కుమార్, రాజు, సురేష్కుమార్, మహిపాల్, దినకర్ పాల్గొన్నారు.