2 గంటలుగా రకుల్ను ప్రశ్నిస్తున్న ఈడీ.. కీలక విషయాలపై ఆరా..
ABN , First Publish Date - 2021-09-03T17:47:08+05:30 IST
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. 2 గంటల నుంచి హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. 2 గంటల నుంచి హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పలు కీలక విషయాలపై ఈడీ ఆరా తీస్తోంది. రకుల్ప్రీత్ సింగ్ బ్యాంక్ లావాదేవీలపై ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. గచ్చిబౌలి, కోకాపేట్, విశాఖలోని ఫిట్నెస్ సెంటర్ల వివరాలను ఈడీ సేకరిస్తోంది. ఎఫ్ క్లబ్ పార్టీలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తోంది. రకుల్, రీయా చక్రవర్తి మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్.. వాట్సప్ చాటింగ్పై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు.
ఇవి కూడా చదవండి
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ వేడి!టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలు లభ్యం.. అన్ని కోట్లా..!?కెల్విన్తో ఆర్థిక లింకులేంటి?డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రకుల్ ప్రీత్సింగ్