ప్రేమ, ఆప్యాయతలతో రక్షాబంధన్
ABN , First Publish Date - 2022-08-13T05:11:22+05:30 IST
ప్రేమ, ఆప్యాయతలతో రక్షాబంధన్
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనురాగం, ఆప్యాయతలకు ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగను శుక్రవారం ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆడపడచులు తమ అన్నా, తమ్ముళ్లకు రాఖీ కట్టి ఆశీర్వాదం ఇచ్చిపుచ్చుకున్నారు. అన్నాతమ్ముళ్లు తమకు తోచినంతలో సోదరీమణులకు బహుమతులు ఇచ్చి వారి దీవెనలు పొందారు. హైదరాబాద్లో విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి తన సోదరుడు నర్సింహారెడ్డి(బాబు)కి రాఖీ కట్టారు. అలాగే బోయి న్పల్లిలోని నివాసంలో మంత్రి మల్లారెడ్డికి ఆయన అక్కాచెల్లెల్లు రాఖీ కట్టి ఆశీర్వదించారు.