అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్‌

ABN , First Publish Date - 2022-08-12T06:01:21+05:30 IST

అన్నాచెల్లెళ్ల అనురాగానికి, అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌ పండగ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.

అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్‌
మంత్రికి రాఖీ కట్టి బొట్టు పెడుతున్న సోదరి

మంత్రికి రాఖీ కట్టి బొట్టు పెడుతున్న సోదరి

విశాఖపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): అన్నాచెల్లెళ్ల అనురాగానికి, అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్‌ పండగ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మిందిలోని తన నివాసంలో రాఖీపౌర్ణమి వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సోదరి సునీత అమర్‌నాథ్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లందరికీ రాఖీ ఎంతో ప్రత్యేకమైన పండగ అని, దీనిని అందరూ ఆనందంగా జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

Updated Date - 2022-08-12T06:01:21+05:30 IST