కళ తప్పిన రక్షాబంధన్‌...

ABN , First Publish Date - 2020-08-04T10:30:30+05:30 IST

అన్నాచెల్లెల పండగగా చెప్పుకునే రక్షాబంధన్‌ సందడి జిల్లాలో సోమవారం కానరాలేదు.

కళ తప్పిన రక్షాబంధన్‌...

సాలూరు రూరల్‌/విజయనగరం రూరల్: ‌అన్నాచెల్లెల పండగగా చెప్పుకునే రక్షాబంధన్‌ సందడి జిల్లాలో సోమవారం కానరాలేదు. కరోనా పుణ్య మాని కళ తప్పింది. గతేడాది సోదరుల చేతిలో అధికంగా రాఖీలు కన్పిస్తే ఈ ఏడాది ఒకటి కన్పించడం అరుదుగా మారింది. రక్షాబంధన్‌ సందర్భంగా గతేడాది జిల్లాలో స్వీట్లు, బంగారం, ఇతర గిఫ్ట్‌ షాపులు తదితర వాటి వ్యాపారం రూ.3.25 కోట్లు జరిగితే... ఈ ఏడాది కేవలం రూ.46 లక్షలకు పడిపోయినట్టు వ్యాపార వర్గాలు చెబుతు న్నాయి. కొన్నిచోట్ల లాక్‌డౌన్‌ ప్రభావంతో వ్యాపారం సన్నగిల్లింది. ఇతర ప్రాంతాల్లోని వారు తమ సోదరులకు మొబైల్స్‌లో శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు. 


ఎంపీ నివాసంలో.. 

చీపురుపల్లి : విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ నివాసంలో సోమవారం రక్షాబంధన్‌ వేడుకలు జరిగాయి. చీపురుపల్లి మాజీ ఎంపీపీ ఇప్పిలి వెంకటనర్సమ్మ ఎంపీ బెల్లానకు రాఖీ కట్టారు. ఈ సంద ర్భంగా ఎంపీ మాట్లాడుతూ సోదర భావానికి ప్రతీకగా ఈ వేడుకలు సంప్రదాయంగా జరుపుకుంటున్నామన్నారు. 

Updated Date - 2020-08-04T10:30:30+05:30 IST