ఘనంగా రాఖీ పౌర్ణమి
ABN , First Publish Date - 2022-08-13T04:48:30+05:30 IST
మండలంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి ఘనంగా జరిగింది. అక్కలకు తమ్ముళ్లు, చెల్లెళ్లకు అన్నలు రాఖీలు కట్టారు.
కోవూరు, ఆగస్టు12: మండలంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి ఘనంగా జరిగింది. అక్కలకు తమ్ముళ్లు, చెల్లెళ్లకు అన్నలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని పురాతన శివాలయంలో భక్తులు ప్రత్యేకపూజలు చేశారు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డికి ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, కవరగిరి శ్రీలత నాయకత్వంలో మహిళలు రాఖీలు కట్టి అండగా ఉంటామన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు దొడ్డంరెడ్డి నిరంజనబాబురెడ్డి, ఏఎంసీ ఇన్చార్జి ఛైర్మన్ పీ రాధాకృష్ణారెడ్డిలకు పలువురు మహిళా ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టారు.
కొడవలూరు : నియోజకవర్గంలోని ఆడపడచులందరికీ అండగా నిలబడుతామని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. నార్తురాజుపాళెంలోని పీఎస్ఆర్ కల్యాణమండపంలో శుక్రవారం ఏర్పాటైన రాఖీ పౌర్ణమి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత మూడేళ్ల పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని చెప్పారు. అమానుష ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. మహిళలకు టీడీపీ అండగా నిలబడుతుందని చెప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్రెడ్డి, టీడీపీ నాయకులు చెముకుల కృష్ణచైతన్య, కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి తదితరులకు టీడీపీ మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టారు.
విడవలూరు : రాఖీ పౌర్ణమి వేడుకులు మండలంలో ఘనంగా జరిగాయి. టీడీపీ మండలాధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులుకు పలువురు మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టారు. రామతీర్థం గ్రామంలో మాజీ సర్పంచు చిమటా వెంకటేశ్వర్లుకు స్థానిక మహిళలు కలసి రాఖీలు కట్టారు. ఎంపీడీవో, తహసీల్దారు కార్యాలయాల్లో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దారు చంద్రశేఖర్లకు మహిళా ఉద్యోగులు రాఖీలు కట్టారు.