రాఖీలు కట్టించుకొనేందుకు తోబుట్టువుల నిరీక్షణ

ABN , First Publish Date - 2022-08-13T04:19:02+05:30 IST

రాఖీపౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం అడవిమల్లెల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులతో రాఖీలు కట్టించుకొనేందుకు అన్నదమ్ములు గంటలతరబడి వేచిచూశారు.

రాఖీలు కట్టించుకొనేందుకు తోబుట్టువుల నిరీక్షణ
తోబుట్టువులతో రాఖీలు కట్టించుకొనేందుకు నిరీక్షిస్తున్న అన్నదమ్ములు

పెనుబల్లి, ఆగస్టు 12: రాఖీపౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం అడవిమల్లెల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులతో రాఖీలు కట్టించుకొనేందుకు అన్నదమ్ములు గంటలతరబడి వేచిచూశారు. రాఖీపౌర్ణమి సందర్భంగా తమ తోబుట్టువులు గురుకులంలో ఉండటంతో వారితో రాఖీలు కట్టించుకోవాలని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 500మందికిపైగా అన్నదమ్ములు, కుటుంబసభ్యులు పాఠశాలకు చేరుకున్నారు. వీరంతా ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు గేటు వద్దనే నిరీక్షించారు. విద్యార్థినులు తరగతుల్లో నిమగ్నం కావడంతో వారిని బయటకు పంపించే అవకాశం లేకుండాపోయింది.  తరగతుల నిర్వహణ అనంతరం ప్రిన్సిపాల్‌ ఆదేశాల మేరకు సాయంత్రం 3గంటలకు పాఠశాలలోకి అనుమతించ టంతో విద్యార్థినులచేత అన్నదమ్ములు రాఖీలు కట్టించుకొని స్వీట్లు పంచుకున్నారు. 

Updated Date - 2022-08-13T04:19:02+05:30 IST