సోదర ప్రేమకు ప్రతీక రాఖీ
ABN , First Publish Date - 2022-08-13T06:14:42+05:30 IST
సోదర ప్రేమకు ప్రతీక రాఖీ
కలెక్టరేట్: సోదర ప్రేమకు ప్రతీక రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని జిల్లాకు చెందిన మహిళా అధికారులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీ రావుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా ధికారులు కలెక్టర్ నుదుటన బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, స్వీట్లు తినిపించి శాలువాతో సత్కరించారు. రాఖీలు కట్టిన వారిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.ఉమాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారిణి సీవీ రేణుక, పౌరసరఫరాల అధి కారిణి కోమలీ పద్మ, డీఎం శిరీష, పశ్చిమ తహసీల్దార్ మాధురి తదితరులు ఉన్నారు.
ప్రముఖులకు రాఖీలు
మచిలీపట్నం టౌన్/ గుడివాడ టౌన్/ పామర్రు: మచిలీపట్నంలో రాఖీ పౌర్ణమిని ఘనంగా జరిపారు. అధి కారులకు, రాజకీయ నాయకులకు మహిళలు రాఖీలు కట్టి తమ సోదరప్రేమను వ్యక్తం చేశారు. కలెక్టర్ రంజిత్ బాషాతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు పలువురు మహిళలు రాఖీలు కట్టారు. గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)కి పలువురు మహిళలు రాఖీలు కట్టారు. పామర్రులో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలు టీడీపీ ఇన్చార్జి వర్లకుమార్రాజాకు రాఖీలు కట్టారు.