ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2022-08-13T05:49:42+05:30 IST

మండలంలో రాఖీ పండుగను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. సోదర, సోదరీమణులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర ముంచంగిపుట్టు వచ్చి తన సోదరుడు జగబంధుకు రాఖీ కట్టి దీవెనలు పొందారు. అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలకు కూడా ఆమె రాఖీలను కట్టారు.

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
తన సోదరుడికి రాఖీ కడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర

ముంచంగిపుట్టులో సోదరుడికి రాఖీ కట్టిన జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర


ముంచంగిపుట్టు, ఆగస్టు 12: మండలంలో రాఖీ పండుగను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. సోదర, సోదరీమణులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర ముంచంగిపుట్టు వచ్చి తన సోదరుడు జగబంధుకు రాఖీ కట్టి దీవెనలు పొందారు. అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలకు కూడా ఆమె రాఖీలను కట్టారు. 


అక్కాచెల్లమ్మలకు అండగా ఉంటా: శ్రావణ్‌కుమార్‌

అక్కా చెల్లమ్మలకు అండగా ఉంటానని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. శుక్ర వారం మండలంలో పర్యటించిన ఆయనకు పలు గ్రామాల్లో మహిళలు రాఖీలను కట్టారు. ఈ సందర్భంగా ఆయన పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకుని,  చిన్నలను దీవించారు. తమ ప్రభుత్వం మహిళాభ్యున్నతి కోసం ఎప్పుడూ పాటుపడుందని, మరలా అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక మహిళల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టిసారిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

Updated Date - 2022-08-13T05:49:42+05:30 IST