జవాన్ రాకేశ్వర్సింగ్ మా ఆధీనంలో ఉన్నాడు: మావోలు
ABN , First Publish Date - 2021-04-05T21:53:55+05:30 IST
ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర కాల్పుల తర్వాత కోబ్రా యూనిట్కు చెందిన రాకేశ్వర్సింగ్ అనే జవాన్ కనిపించకుండా పోయారు.
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర కాల్పుల తర్వాత కోబ్రా యూనిట్కు చెందిన రాకేశ్వర్సింగ్ అనే జవాన్ కనిపించకుండా పోయారు. అయితే ఈ జవాన్ ఇప్పుడు మావోయిస్టుల చెరలో ఉన్నారు. ఇందుకు సంబంధించి మావోలు ఓ లేఖను విడుదల చేశారు. జవాన్ రాకేశ్వర్సింగ్ తమ ఆధీనంలో ఉన్నాడని లేఖలో తెలిపారు. ఈ లేఖలో మరికొన్ని డిమాండ్లను మావోలు ప్రభుత్వం ముందు ఉంచారు. ‘ఆపరేషన్ ప్రహార్-3’ అనే పేరుతో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, దేశంలో హక్కుల ఉద్యమాలను అణిచివేసేందుకు ప్రభుత్వాలు, పోలీసు బలగాలను ఉపయోగిస్తున్నాయని, పోలీసు బలగాలను తక్షణమే నిలిపివేయాలని మావోలు లేఖలో డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి 25వ తేదీ వరకు దేశంలో అన్ని ప్రజా ఉద్యమాలను మద్దతుగా విప్లవాత్మక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 26న భారత్ బంద్ నిర్వహించాలని మావోయిస్టులు పిలునిచ్చారు.