ఈ వేడుక ఏదోక రోజు ముగుస్తుంది: రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా

ABN , First Publish Date - 2021-07-20T00:42:40+05:30 IST

త్త తరం ఐపీఓలపై ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వేడుక ఏదోక రోజు ముగుస్తుంది: రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా

ముంబై: ఇటీవల జొమాటో ఐపీవోకు మదుపర్ల నుంచి అపూర్వస్పందన లభించిన విషయం తెలిసిందే. ఇది మార్కెట్లో ఉత్సాహకర వాతావరణాన్ని సృష్టించడంతో త్వరలో రాబోయే పేటీఎం ఐపీఓపై మార్కెట్ వర్గాల అంచనాలు మరింత పెరిగాయి. ఈ కొత్తతరం టెక్ సంస్థల ఐపీఓల్లో రిటైల్ ఇన్వెస్టర్ల హవానే అధికం. పెట్టుబడులు పెట్టేందుకు యువత స్టాక్ మార్కెట్‌వైపు మళ్లుతుండటంతో టెక్ సంస్థల ఐపీఓలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త తరం ఐపీఓలపై ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. 


‘‘లోహాలు, బ్యాంకింగ్ రంగాల్లోనే పెట్టుబడులు మరింత అధిక లాభాలు ఇస్తాయనేది నా అభిప్రాయం. అయితే..ఇది నాకు సంబంధించిన విషయం కాదు కాబట్టి నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. కానీ.. ఈ హడావుడి ఏదోకరోజు ముగుస్తుంది.’’ అని ఆయన కామెంట్ చేశారు. ఈ కొత్తతరం టెక్ సంస్థల వ్యాపార మోడళ్లపై తనకు ఎటువంటి సందేహాలూ లేవని చెప్పిన ఆయన.. కంపెనీల మార్కెట్ విలువపై నెలకొన్న అసాధారణ అంచనాలే ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మోతీలాల్ ఓస్వాల్ ఏఎమ్‌సీ గ్లోబల్ పార్టనర్ సమ్మిట్‌లో పాల్గొన్న రాకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-07-20T00:42:40+05:30 IST