ముగ్గురూ శ్రీమంతులే!
ABN , First Publish Date - 2022-05-27T09:07:44+05:30 IST
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులూ స్థితి
- టీఆర్ఎస్ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థులు
పార్థసారథి, వద్దిరాజు, దామోదర్రావు కోటీశ్వరులు
-వద్దిరాజు ఎన్నికపై గెజిట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులూ స్థితి మంతులే. వారు తమ నామినేషన్తోపాటు ఎన్నికల సంఘానికి సమర్పించి అఫిడవిట్ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
- రాజ్యసభ ఉప ఎన్నిక స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర పేరిట ఉన్న స్థిర, చరాస్తుల విలువ రూ.35,31,18,349.10 కాగా.. అప్పులు రూ.12,10,34,346.52. ఇక, ఆయన భార్య విజయలక్ష్మి పేరిట ఉన్న స్థిర, చరాస్తుల విలువ.. రూ.7,29,37,365.17 కాగా.. ఆమె అప్పులు రూ.2,04,20,326.08.
- దామోదర్రావు స్థిరచరాస్తులు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ అన్నింటి విలువ కలిపి రూ.170,79,45,596 కాగా.. అప్పులు రూ.49,01,76,214.
- బండి పార్థసారథి పేరిట ఉన్న స్థిర, చరాస్తులన్నింటి విలువ రూ.4023,28,87,108 (హిందూ అవిభాజ్య కుటుంబ కర్తగా ఆయనకున్న ఆస్తులు కూడా కలిపి) కాగా.. అప్పులు రూ.59,90,684. ఇక, ఆయన భార్య పేరిట ఉన్న స్థిరచరాస్తుల విలువ.. రూ.1276,92,64,571.00 కాగా, ఆమె అప్పులు రూ.13,89,185. ..కాగా, రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నిక స్థానానికి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు భారత సర్కారు నిర్ధారించింది. ఈ మేరకు కేంద్ర చట్ట, న్యాయ విభాగం మంత్రిత్వ శాఖ గురువారం గెజిట్ను జారీచేసింది.