నల్లగొండలో రాజ్యాధికార సంకల్ప సభ

ABN , First Publish Date - 2021-08-08T00:48:42+05:30 IST

రాజ్యాధికార సంకల్ప సభ పేరిట బహుజన సమాజ్‌ పార్టీ ఆదివారం నల్లగొండలో బహిరంగ సభ ఏర్పాటుచేసింది.

నల్లగొండలో రాజ్యాధికార సంకల్ప సభ

నల్లగొండ: రాజ్యాధికార సంకల్ప సభ పేరిట బహుజన సమాజ్‌ పార్టీ ఆదివారం నల్లగొండలో బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ సభలో మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీ కండువా కప్పుకోనున్నారు. బహుజన సమాజ్‌ పార్టీ జాతీయ కోఆర్డినేటర్‌, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్‌ ఆధ్వర్యంలో ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో చేరనున్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో 10వేల మందితో సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ జిల్లా బీఎస్పీనాయకులు పోలీసులకు చేసిన దరఖాస్తులో పేర్కొన్నారు. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అంశాల ఎజెండాగా ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో చేరనున్నారు. ఈ మేరకు 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ, స్వేరోస్‌) ఆధ్వర్యంలో గ్రామాల్లో పర్యటించి నల్లగొండ సభకు రావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. వాహనాలను సొంతంగా సమకూర్చుకోవాలని భోజన ఖర్చు కూడా స్వచ్ఛందంగా భరిస్తూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించి జనసమీకరణ చేస్తున్నారు. 

Updated Date - 2021-08-08T00:48:42+05:30 IST