ఒకే గొడుగు కిందకు 3 ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు

ABN , First Publish Date - 2022-04-06T01:46:11+05:30 IST

న్యూఢిల్లీ: ఇప్పటిదాకా వేర్వేరుగా ఉన్న మూడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లన్నీ ఇప్పుడు ఒక్కటయ్యాయి. దీనికి సంబంధించి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2022ను నేడు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

ఒకే గొడుగు కిందకు 3 ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు

న్యూఢిల్లీ: ఇప్పటిదాకా వేర్వేరుగా ఉన్న మూడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లన్నీ ఇప్పుడు ఒక్కటయ్యాయి. దీనికి సంబంధించి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2022ను నేడు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. గత నెల 30న ఇప్పటికే లోక్‌సభ ఆమోదించింది. నార్త్, సౌత్, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లుగా ఉన్న వాటిని ఇప్పుడు ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లపై సవతి తల్లి ప్రేమ చూపేవారని రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆప్ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా వందల సార్లు ఆందోళనలు చేశారని షా గుర్తు చేశారు. ఇప్పుడు మూడు కార్పొరేషన్లు ఒకే గొడుగు కిందకు రావడం వల్ల అభివృద్ధి సాధ్యమౌతుందని చెప్పారు. 



Updated Date - 2022-04-06T01:46:11+05:30 IST