ప్రధాని, ఆర్థికమంత్రితో జగన్ భేటీలో ఏం జరిగిందో చెప్పాలి: ఎంపీ కనకమేడల
ABN , First Publish Date - 2022-01-04T04:26:46+05:30 IST
ప్రధాని, ఆర్థికమంత్రితో జగన్ భేటీలో ఏం జరిగిందో చెప్పాలని టీడీపీ ఎంపీ కనకమేడల అన్నారు. ప్రధానికి విజ్ఞప్తి పత్రం ఇచ్చినప్పుడు లేఖ విడుదల చేస్తారన్నారు. తెరవెనుక ఏదో జరిగిందనే సందేహం ప్రజలకు..
న్యూఢిల్లీ: ప్రధాని, ఆర్థికమంత్రితో జగన్ భేటీలో ఏం జరిగిందో చెప్పాలని టీడీపీ ఎంపీ కనకమేడల అన్నారు. ప్రధానికి విజ్ఞప్తి పత్రం ఇచ్చినప్పుడు లేఖ విడుదల చేస్తారన్నారు. తెరవెనుక ఏదో జరిగిందనే సందేహం ప్రజలకు ఉందని చెప్పారు. జగన్ సడెన్గా ప్రధాని మోదీని కలవడం కోసం వచ్చారన్నారు. ‘‘పోలవరం నిధులు, 2013 భూ సేకరణ చట్టం ప్యాకేజీ నిధులు అడిగారు. గతంలో పోలవరంపై జగన్రెడ్డి లేఖ వల్లే ఈరోజు ఏపీకి నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వస్తున్నాయి. కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో మంత్రి బుగ్గన సమాధానం చెప్పాలి.’’ అని కనకమేడల వ్యాఖ్యానించారు.