రాజ్యసభకు దేవెగౌడ, ఖర్గే!

ABN , First Publish Date - 2020-05-27T08:04:44+05:30 IST

కర్ణాటక నుంచి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ(జేడీఎస్‌), సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే

రాజ్యసభకు దేవెగౌడ, ఖర్గే!

  • కర్ణాటకలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఒప్పందం?

బెంగళూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక నుంచి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ(జేడీఎస్‌), సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే రాజ్యసభలోకి ప్రవేశించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ మధ్య  ఒప్పందం కుదిరింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం దీనికి ఆమోదం వేయడమే తరువాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ తుమకూరులో పోటీ చేసి ఓడిపోగా, గుల్బర్గాలో ఖర్గే తొలిసారి ఓటమి పాలయ్యారు. ఈ సీనియర్‌ నేతలిద్దరినీ రాజ్యసభకు పంపించే అంశంపై కొద్దిరోజులుగా కసరత్తు జరుగుతోంది. కాగా, బీజేపీ మాత్రం ఇంకా తన అభ్యర్థుల గుట్టు విప్పలేదు.

Updated Date - 2020-05-27T08:04:44+05:30 IST