అమర కల్నల్ భార్య ధన్నో‌దేవికి Defence Minister Rajnath Singh పాదాభివందనం

ABN , First Publish Date - 2021-12-15T14:23:23+05:30 IST

భారత్-పాక్ యుద్ధంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన అమర కల్నల్ హోషియార్ సింగ్ భార్య ధన్నో‌దేవికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాదాభివందనం చేశారు....

అమర కల్నల్ భార్య ధన్నో‌దేవికి Defence Minister Rajnath Singh పాదాభివందనం

న్యూఢిల్లీ: భారత్-పాక్ యుద్ధంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన అమర కల్నల్ హోషియార్ సింగ్ భార్య ధన్నో‌దేవికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాదాభివందనం చేశారు.యుద్ధవీరుడిని గౌరవిస్తూ అతని భార్య పాదాలను కేంద్రమంత్రి సింగ్ తాకిన ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.యుద్ధ వీరుడైన కల్నల్ హోషియార్ సింగ్‌ 1971 నాటి పాక్ యుద్ధంలో అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించినందుకు దేశంలోని అత్యున్నత సైనిక గౌరవమైన పరమవీర చక్ర పతకంతో సత్కరించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరైన సందర్భంగా యుద్ధవీరుడి భార్య ధన్నోదేవిని కలిశారు.


1971వ సంవత్సరంలో పాకిస్థాన్ దేశంతో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించిన 50వ వార్షికోత్సవానికి ముందు న్యూఢిల్లీలో విజయ్ పర్వ్ సమాపన్ సమరోహ్ జరిగింది.‘‘1971వ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో పోరాడిన యుద్ధవీరులు, భారత యుద్ధ అనుభవజ్ఞులతో నేను స్నేహపూర్వకంగా సంభాషించాను. భారత సాయుధ బలగాలు వారి పరాక్రమ పోరాటంలో ధైర్యవంతులైన సైనికాధికారులను కలిశాను’’  అని రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2021-12-15T14:23:23+05:30 IST