ఆ విషయంలో రాజీ ప్రశ్నే లేదు...

ABN , First Publish Date - 2021-10-23T18:13:56+05:30 IST

దేశ రక్షణ రంగ సామర్థ్యం గత ఏడేళ్లలో పతాక స్థాయికి చేరిందని, ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూసేలా చేసిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో శుక్రవారం ఐఐఎఫ్‌ సదస్సు

ఆ విషయంలో రాజీ ప్రశ్నే లేదు...

                  - రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌


బెంగళూరు(Karnataka): దేశ రక్షణ రంగ సామర్థ్యం గత ఏడేళ్లలో పతాక స్థాయికి చేరిందని, ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూసేలా చేసిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో శుక్రవారం ఐఐఎఫ్‌ సదస్సు ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రక్షణ రంగాన్ని ఆధునీకరించేందుకు పూర్తిస్థాయిలో అధునాతన ఆయుధాలను సమకూర్చేందుకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిచ్చిందన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. చైనా, పాకిస్థాన్‌లకు మన రక్షణ శాఖ సత్తా ఏమిటో చాటి చూపామన్నారు. డిఫెన్స్‌ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌చౌదరి, రక్షణా శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌, కర్ణాటక రెవిన్యూ శాఖా మంత్రి ఆర్‌. అశోక్‌తో పాటు పలువురు సైనిక ఉన్నతాధికారులు ఈ సందర్భంగా హాజరయ్యారు. సదస్సులో భాగంగా యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో భాగంగా స్వర్ణిమ్‌ విజయ్‌ వర్ష్‌ పేరిట ప్రత్యేక ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-10-23T18:13:56+05:30 IST