రాజీవ్ హత్యకేసు ముద్దాయి Ravichandranకు పెరోల్ పొడిగింపు
ABN , First Publish Date - 2021-12-19T15:59:12+05:30 IST
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసు ముద్దాయి రవిచంద్రన్కు పెరోల్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. రవిచంద్రన్ మదురై సెంట్రల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నాడు.
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసు ముద్దాయి రవిచంద్రన్కు పెరోల్ పొడిగిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. రవిచంద్రన్ మదురై సెంట్రల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నాడు. రవిచంద్రన్కు పెరోల్ మంజూరు చేయాలని అతడి తల్లి రాజేశ్వరి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు నెల రోజులపాటు అతడికి పెరోల్ మంజూరైంది. తూత్తుకుడి జిల్లా విలాత్తికుళం సమీపం సూరప్పనాయకన్పట్టిలో తల్లితోపాటు గడిపాడు. అతడి పెరోల్ గడువు ముగియనున్న నేపథ్యంలో రెండోమారు పెరోల్ మంజూరు చేయాలని రాజేశ్వరి పెట్టుకున్న విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు వచ్చే జనవరి 15వరకు రవిచంద్రన్కు పెరోల్ పొడిగించారు.