రాజీవ్‌ స్వగృహ ప్లాటింగ్‌ పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-22T05:33:15+05:30 IST

రాజీవ్‌ స్వగృహ స్థలాల ప్లాటింగ్‌ పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు.

రాజీవ్‌ స్వగృహ ప్లాటింగ్‌ పనులు వేగవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌

- అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌

కరీంనగర్‌, మే 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాజీవ్‌ స్వగృహ స్థలాల ప్లాటింగ్‌ పనులను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రాజీవ్‌ స్వగృహ అంగారక టౌన్‌షిప్‌ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌ గ్రామంలోని రాజీవ్‌ స్వగృహ అంగారక టౌన్‌షిప్‌లోని స్థలాలను చదును చేసి, సర్వేయర్లతో మ్యాపింగ్‌ చేసి ప్లాటింగ్‌ హద్దురాళ్లను ఏర్పాటు చేసి కలరింగ్‌ చేయాలని అన్నారు. పెద్ద ఫ్లెక్సీలో మ్యాప్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో రాజీవ్‌ స్వగృహ చీఫ్‌ ఇంజనీర్‌ ఈశ్వరయ్య, మున్సిపల్‌క మిషనర్‌ సేవా ఇస్లావత్‌, ఆర్‌డీవో ఆనంద్‌ కుమార్‌వ, ల్యాండ్‌ సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌, తిమ్మాపూర్‌ తహసిల్దార్‌ రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T05:33:15+05:30 IST