రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2020-05-22T09:35:50+05:30 IST

దేశానికి రాజీవ్‌ గాంధీ చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర కాంగ్రెస్‌ బీసీ సెల్‌ చైర్మన్‌ నులుకుర్తి

రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయం

 డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మే 21: దేశానికి రాజీవ్‌ గాంధీ చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర కాంగ్రెస్‌ బీసీ సెల్‌ చైర్మన్‌ నులుకుర్తి వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో గురువారం మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నులుకుర్తి మాట్లాడుతూ  దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో  పురోగమించేందుకు రాజీవ్‌ గాంధీ కీలక నిర్ణయాలను తీసుకున్నారన్నారు.  రాష్ట్ర కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ ఎస్‌ కృష్ణచైతన్యరెడ్డి, సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోలా ప్రసాదవర్మ పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-22T09:35:50+05:30 IST