‘రజనీ వస్తే రాష్ట్రంలో ఆధ్యాత్మిక పాలన’

ABN , First Publish Date - 2020-09-20T14:56:24+05:30 IST

తమిళ సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ నేతృత్వంలో రాష్ట్రంలో ఆధ్యాత్మిక పాలన చిగురి స్తుందని హిందూ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు అర్జున్‌ సంపత్‌ పేర్కొన్నారు. దీనిపై ఆయన శనివారం మీడియాతో

‘రజనీ వస్తే రాష్ట్రంలో ఆధ్యాత్మిక పాలన’

చెన్నై : తమిళ సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ నేతృత్వంలో రాష్ట్రంలో ఆధ్యాత్మిక పాలన చిగురిస్తుందని హిందూ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు అర్జున్‌ సంపత్‌ పేర్కొన్నారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... అక్టోబరు 2వ తేది మహాత్మాగాంధీ జయంతి రోజున ఈరోడ్‌ జిల్లా చెన్నిమలైలో తమ పార్టీ తరఫున ఆధ్యాత్మిక మహానాడు జరుగనుందని, ఇందులో కందషష్టి కవచం పారాయణం చేసి, కావళ్ల ఊరేగింపును విజయవంతం చేయడం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నేతృత్వంలో ఆధ్యాత్మిక పాలన వచ్చేందుకు హిందూ మక్కల్‌ కట్చి కృషి చేస్తుందని, ద్రావిడ పార్టీల పాలనకు చరమగీతం పాడి, బీజేపీ సారథ్యంలోని కూటమి 234 నియోజకవర్గాలలో పోటీచేసి ఘనవిజయం సాధించి తీరుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-20T14:56:24+05:30 IST