Rajendranagar‎లో దారుణం..యువకుడిని చితకబాదిన గుర్తు తెలియని దుండగులు

ABN , First Publish Date - 2021-11-29T14:43:10+05:30 IST

రాజేంద్రనగర్‎లో అర్ధరాత్రి దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు యువకుడిని చితకబాదారు. గొంతుపై కత్తిపెట్టి చంపుతామని బెదిరించి. రూ. 3వేల నగదు, 20 వేల విలువైన సెల్ ఫోన్ లాక్కొని

Rajendranagar‎లో దారుణం..యువకుడిని చితకబాదిన గుర్తు తెలియని దుండగులు

హైదరాబాద్: రాజేంద్రనగర్‎లో అర్ధరాత్రి దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు యువకుడిని చితకబాదారు. గొంతుపై కత్తిపెట్టి చంపుతామని బెదిరించి. రూ. 3వేల నగదు, 20 వేల విలువైన సెల్ ఫోన్ లాక్కొని పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. యువకుడు నాగార్జున తన తల్లికి మందులు తీసుకెళ్లడం కోసం నగరానికి వచ్చాడు. రాత్రి 10 గంటల సమయంలో ఎల్బీనగర్ నుంచి లక్డీకపూల్‎కి వచ్చాడు. అక్కడి నుంచి ఓయూ కాలనీ వెళ్లేందుకు అక్కడే ఉన్న ఆటో ఎక్కి ఆటో ఎక్కాడు. అప్పటికే సాధారణం ప్రయాణికులాగానే మరో ఇద్దరు యువకులు ఎక్కారు. కొద్దీ దూరం వెళ్లాక..నానాల్ నగర్ వద్ద లంగర్ హౌజ్ వైపు ఆటోను మళ్లించారు. ఈ రూట్ వైపు ఎందుకు వెళ్తున్నావని ఆటో డ్రైవర్‎ని అడగడంతో గొంతుపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించారని బాధితుడు పోలీసులకు వెల్లడించాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-29T14:43:10+05:30 IST