నన్ను విడుదల చేయండి ప్లీజ్‌

ABN , First Publish Date - 2022-06-10T14:58:19+05:30 IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసుల్లో దోషిగా తేలి, వేలూరు సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తనను విడుదల చేయాలని కోరుతూ శాంతను రాష్ట్ర గవర్నర్‌

నన్ను విడుదల చేయండి ప్లీజ్‌

                                   - గవర్నర్‌కు శాంతను లేఖ


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 9: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసుల్లో దోషిగా తేలి, వేలూరు సెంట్రల్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తనను విడుదల చేయాలని కోరుతూ శాంతను రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి లేఖ రాశారు. రాజీవ్‌ హత్య కేసులో ఏడుగురు దోషులుగా తేలగా, పేరరివాలన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగురు ముద్దాయిలు తమను కూడా విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వరుస వినతులు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్దాయిల్లో ఒకరైన శాంతను తనను విడుదల చేయాలంటూ గవర్నర్‌కు లేఖ పంపించారు. తాను 30ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నానని, శ్రీలంకలో వున్న తన తండ్రి మరణించినప్పుడు, ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కూడా తనను అనుమతించలేదన్నారు. ప్రస్తుతం వృద్ధాప్యంలో వున్న తన తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతోందని, ఆమె బాగోగులు చూసుకునేందుకు అనువుగా తనకు క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-06-10T14:58:19+05:30 IST