రాజీవ్‌గాంధీ Hospitalలో మంత్రి తనిఖీలు

ABN , First Publish Date - 2022-06-19T14:17:26+05:30 IST

స్థానిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో శనివారం ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ ఆసుపత్రిలో మందుల కొరత

రాజీవ్‌గాంధీ Hospitalలో మంత్రి తనిఖీలు

పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 18: స్థానిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో శనివారం ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ ఆసుపత్రిలో మందుల కొరత ఉందని వార్తలు వెలువడిన నేపథ్యంలో, మంత్రి ఈ తనిఖీ చేపట్టడం విశేషం. తొలిగా ఐసీయూకు వెళ్లిన మంత్రి.. అక్కడ వైద్యం అందిస్తున్నట్లు తీరు పట్ల రోగులను అడిగి తెలుసుకున్నారు. వారికి తగిన మందులిస్తున్నారా లేదా అని రోగులను, ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన రికార్డుల గదికి వెళ్లి మందుల స్టాకు వివరాలు తెలుసుకున్నారు. గంటకు పైగా రికార్డులను పరిశీలించి, లోటుపాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి ఉన్నతాధికారులతో మాట్లాడుతూ.. ఎక్కడా రోగులకు ఇబ్బంది రానీయకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

Updated Date - 2022-06-19T14:17:26+05:30 IST