Rajeev జ్యోతి సద్భావన యాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-21T16:33:13+05:30 IST
దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రాజీవ్ స్మారక జ్యోతి సద్భావన యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) ఆధ్వర్యంలో వంద
ప్యారీస్(చెన్నై): దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రాజీవ్ స్మారక జ్యోతి సద్భావన యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) ఆధ్వర్యంలో వంద ద్విచక్రవాహనాలతో చేపట్టిన ఈ యాత్రను కన్నియాకుమారి ఎంపీ విజయ్ వసంత్, టీఎన్సీసీ ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ జిల్లా నిర్వాహకులు కమలిక కామరాజ్, టీవీ భాస్కర్, కౌన్సిలర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు. తొరువొత్తియూర్ నుంచి బయల్దేరిన ఈ యాత్ర రాయపురం, ఆర్కే నగర్, సైదాపేట, పోరూర్, పూందమల్లి మీదుగా శనివారం ఉదయం 6 గంటలకు శ్రీ పెరుంబుదూర్లోని రాజీవ్ స్మారక స్థలికి చేరుకుంటుంది. అక్కడ టీఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, పార్టీ నాయకులు స్వాగతం పలుకనున్నారు. అక్కడ నుంచి పలు రాష్ట్రాల మీదు గా మూడు నెలల అనంతరం ఢిల్లీ చేరుకొని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజీవ్ స్మారక జ్యోతి అందజేయను న్నట్లు కె.చిరంజీవి తెలిపారు.