HYD: రాజ్భవన్ ముట్టడి...కాంగ్రెస్ నేతల అరెస్ట్
ABN , First Publish Date - 2021-07-22T18:55:53+05:30 IST
ఫోన్ ట్యాపింగ్కు నిరసనగా కాంగ్రెస్ చలో రాజ్ భవన్కు పిలుపునిచ్చింది.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్కు నిరసనగా కాంగ్రెస్ చలో రాజ్ భవన్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాజ్భవన్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. విడతల వారిగా కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి వస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు ముట్టడికి వస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వర్షంలోనూ పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు.