ఉక్కు అధికారికి రాజభాష నిష్టా సమ్మాన్ అవార్డు
ABN , First Publish Date - 2022-05-17T06:07:47+05:30 IST
విశాఖ స్టీల్ప్లాంట్ ఐటీ, ఈఆర్పీ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ మనోహార్ దివేచాకు ప్రతిష్టాత్మకమైన కేంద్ర రాజభాష నిష్టా సమ్మాన్ అవార్డు లభించింది.
ఉక్కుటౌన్షిప్, మే 16: విశాఖ స్టీల్ప్లాంట్ ఐటీ, ఈఆర్పీ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రభాకర్ మనోహార్ దివేచాకు ప్రతిష్టాత్మకమైన కేంద్ర రాజభాష నిష్టా సమ్మాన్ అవార్డు లభించింది. ప్రభుత్వ రంగ సంస్థలలో హిందీ అమలుకు కృషి చేస్తున్న వ్యక్తులకు ఈ అవార్డు అందజేస్తారు. ఈ నెల 13న సిక్కిం రాష్ట్రం గాంగ్టక్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్రసింగ్ చేతుల మీదుగా స్టీల్ప్లాంట్ సీఎండీ అతుల్భట్ అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలో స్టీల్ప్లాంట్ పరిపాలన భవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో మనోహార్ దివేచాకు సీఎండీ అవార్డు అందజేశారు.