ఉక్కు అధికారికి రాజభాష నిష్టా సమ్మాన్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-05-17T06:07:47+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఐటీ, ఈఆర్‌పీ విభాగం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ప్రభాకర్‌ మనోహార్‌ దివేచాకు ప్రతిష్టాత్మకమైన కేంద్ర రాజభాష నిష్టా సమ్మాన్‌ అవార్డు లభించింది.

ఉక్కు అధికారికి రాజభాష నిష్టా సమ్మాన్‌ అవార్డు
దివేచాకు అవార్డు అందజేస్తున్న స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌

ఉక్కుటౌన్‌షిప్‌, మే 16: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఐటీ, ఈఆర్‌పీ విభాగం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ప్రభాకర్‌ మనోహార్‌ దివేచాకు ప్రతిష్టాత్మకమైన కేంద్ర రాజభాష నిష్టా సమ్మాన్‌ అవార్డు లభించింది. ప్రభుత్వ రంగ సంస్థలలో హిందీ అమలుకు కృషి చేస్తున్న వ్యక్తులకు ఈ అవార్డు అందజేస్తారు.  ఈ నెల 13న సిక్కిం రాష్ట్రం గాంగ్‌టక్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్రసింగ్‌ చేతుల మీదుగా స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌ అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలో స్టీల్‌ప్లాంట్‌ పరిపాలన భవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో మనోహార్‌ దివేచాకు సీఎండీ అవార్డు అందజేశారు. 


Updated Date - 2022-05-17T06:07:47+05:30 IST