IPL 2022: టాస్ గెలిచి టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన రాజస్థాన్

ABN , First Publish Date - 2022-04-15T00:42:38+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్- గుజరాత్

IPL 2022: టాస్ గెలిచి టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన రాజస్థాన్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రత్యర్థి టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రాజస్థాన్ ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడి మూడింటిలో గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతుండగా, గుజరాత్ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. అయితే, రన్‌రేట్ తక్కువగా ఉండడంతో ఐదో స్థానంలో ఉంది.


ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు ట్రెంట్ బౌల్ట్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో జిమ్మీ నీషమ్ జట్టులోకి వచ్చాడు. గుజరాత్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. దర్శన్ నల్‌కండే స్థానంలో యష్ దయాల్, సాయి సుదర్శన్ స్థానంలో విజయ్ శంకర్ జట్టులోకి వచ్చారు.

Updated Date - 2022-04-15T00:42:38+05:30 IST